కరోనా సమయంలో ఆదాయం తగ్గలేదు: కనకమేడల

ABN , First Publish Date - 2021-10-20T01:16:33+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అప్పులకు, చేస్తున్న సంక్షేమానికి పొంతన లేదని ఎంపీ కనకమేడల అన్నారు. సంక్షేమం పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టిస్తోందన్నారు.

కరోనా సమయంలో ఆదాయం తగ్గలేదు: కనకమేడల

అమరావతి: వైసీపీ ప్రభుత్వ అప్పులకు, చేస్తున్న సంక్షేమానికి పొంతన లేదని ఎంపీ కనకమేడల అన్నారు. సంక్షేమం పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టిస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమానికి రూ.4లక్షలకోట్లు ఖర్చుపెట్టారని ఆయన గుర్తుచేశారు. జగన్‌ సంక్షేమానికి రెండున్నరేళ్లలో రూ.1.30 లక్షల కోట్లు మాత్రమే ఖర్చుచేశారని చెప్పారు. ఈ రెండున్నరేళ్లలో ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ.2,87,357కోట్లు అని పేర్కొన్నారు. మిగిలిన సొమ్ము ఏంచేశారంటే  లెక్కలులేవని చెప్పారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గలేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ ఆర్థిక సంక్షోభానికే దారితీస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్తులకు పాలకులు కేవలం కస్టోడియన్లు మాత్రమేనన్నారు. 

Updated Date - 2021-10-20T01:16:33+05:30 IST