మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ

ABN , First Publish Date - 2022-10-05T08:39:56+05:30 IST

మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ

మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ

విజయవాడ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): బెజవాడ కనకదుర్గమ్మ మహర్నవమి పర్వదినాన మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పాలక మండలి చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్ర్తాలను సమర్పించారు. బుధవారం విజయదశమి సందర్భంగా సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవాన్ని శాస్త్రయుక్తంగా మాత్రమే నిర్వహిస్తారు. నదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున హంస వాహనాన్ని దుర్గా ఘాట్‌ వద్ద కొంతదూరం తిప్పుతారు. నదీ విహారం ఉండదు.


Updated Date - 2022-10-05T08:39:56+05:30 IST