ఆరుబయట నిద్రిస్తున్న మహిళలపై తెగిపడిన విద్యుత్ వైర్లు

ABN , First Publish Date - 2022-05-10T15:06:23+05:30 IST

కంభం మండలం లింగాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆరుబయట నిద్రస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు

ఆరుబయట నిద్రిస్తున్న మహిళలపై తెగిపడిన విద్యుత్ వైర్లు

ప్రకాశం: కంభం మండలం లింగాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఆరుబయట నిద్రస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు మహిళలపై పడటంతో ఫాతిమా అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా..మరో మహిళ రామలింగమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే మహిళను కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో మహిళను మెరుతైన చికిత్స కోసం నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.

Read more