కామాక్షితాయికి వైభవంగా సామూహిక కుంకుమార్చన

ABN , First Publish Date - 2021-04-17T04:41:35+05:30 IST

మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో కామాక్షితాయికి శుక్రవారం సామూహిక కుంకుమార్చన వైభవంగా జరిగింది.

కామాక్షితాయికి వైభవంగా సామూహిక కుంకుమార్చన
వెండి రథోత్సవంపై ఊరేగుతున్న కామాక్షితాయి

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్‌ 16: మండలంలోని జొన్నవాడ శ్రీమల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయంలో కామాక్షితాయికి శుక్రవారం సామూహిక కుంకుమార్చన వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ముందుగా అమ్మవారి ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి, అనంతరం లలితా సహస్రనామార్చనతో కుంకుమార్చన నిర్వహించారు. ఉభయదాతలతో పాటు ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు ఈ పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి ఆలయంలో పల్లకిసేవ నిర్వహించి, ఆలయ ప్రదక్షిణలతో ఊరేగించారు. అనంతరం అమ్మవారికి వెండి రథోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో ఏవీ. శ్రీనివాసులురెడ్డి, పాలకవర్గం సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. 

Updated Date - 2021-04-17T04:41:35+05:30 IST