TS News: మృత్యువులోనూ వీడని బంధం

ABN , First Publish Date - 2022-08-17T15:32:34+05:30 IST

ఆ దంపతుల బంధం మృత్యువులోనూ వీడలేదు. గుండెపోటుతో భర్త మృతి చెందిన కాసేపటికే భార్య కూడా ప్రాణాలు విడిచింది.

TS News: మృత్యువులోనూ వీడని బంధం

కామారెడ్డి: ఆ దంపతుల బంధం మృత్యువులోనూ వీడలేదు. గుండెపోటుతో భర్త మృతి చెందిన కాసేపటికే భార్య కూడా ప్రాణాలు విడిచింది. ఈ ఘటన జిల్లాలోని లింగపేట్ మండలం షెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో నివాసం ఉంటున్న రాజయ్య (61) గుండెపోటుకు గురయ్యాడు. ఛాతీలో నొప్పిరావడంతో ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే రామయ్య  మృత్యువాత పడ్డాడు. అయితే భర్త రాజయ్య అంతక్రియలు ఏర్పాటు చేస్తుండగా భార్య లచ్చవ్వ (54) గుండెపోటుతో ప్రాణాలు విడిచింది. దీంతో కుటుంబసభ్యులు ఇద్దరిని కలిపి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. 

Updated Date - 2022-08-17T15:32:34+05:30 IST