Kamareddy మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-05-30T16:12:57+05:30 IST
జిల్లాలోని మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కామారెడ్డి: జిల్లాలోని మున్సిపాలిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజా దర్బార్కు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ముఖ్యనేతలు సహా 100 మందికి పైగా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా... కామారెడ్డి బల్దియాలో అవినీతి, కబ్జాలు, అక్రమ భూదందాలపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. సవాళ్లు, ప్రతిసవాళ్ళతో ప్రజా దర్బార్ పేరుతో బహిరంగ చర్చకు ఇరుపార్టీలు సిద్ధమైన విషయం తెలిసిందే.