కామారెడ్డిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-03-16T16:32:15+05:30 IST

జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

కామారెడ్డిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

కామారెడ్డి: జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొత్త బస్టాండ్‌కు ఎదురుగా ఉన్న శ్రీసాయి క్రిష్ణ లాడ్జ్‌లో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకున్నాడు. గది నుంచి దుర్వాసన రావడంతో లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. మృతుడు హైదరాబాద్ ప్రాంతానికి చెందిన గోవింద్ లాల్‌గా గుర్తించారు. ఈ నెల 12 నుంచి లాడ్జిలో బస చేసినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

Updated Date - 2022-03-16T16:32:15+05:30 IST