kamareddy: భిక్షాటన చేసే బాలికపై అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2022-02-08T16:37:57+05:30 IST

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో భిక్షాటన చేసే బాలికపై పెయింటర్ కనకయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.

kamareddy: భిక్షాటన చేసే బాలికపై అత్యాచారయత్నం

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో భిక్షాటన చేసే బాలికపై పెయింటర్ కనకయ్య అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. భయంతో బాలిక కేకలు వేయడంతో వెంటనే అక్కడకు చేరుకున్న స్థానికులు పెయింటర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆపై నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు కనకయ్య రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అలాగే బాధితురాలు నిజామాబాద్‌కు చెందిన బాలికగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2022-02-08T16:37:57+05:30 IST