Telangana: ధాన్యం దొంగలించేందుకు యత్నం...దుండగుడికి దేహశుద్ధి
ABN , First Publish Date - 2021-11-14T14:41:10+05:30 IST
జిల్లాలోని కామారెడ్డి మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని దొంగలించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు.
కామారెడ్డి: జిల్లాలోని కామారెడ్డి మార్కెట్ యార్డ్లో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని దొంగలించేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. వెంటనే గుర్తించిన స్థానికులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు. కాగా ధాన్యం దొంగిలిస్తుండగా పట్టుకున్న స్థానికులపైనే దొంగ దాడి చేశాడు. దీంతో దొంగకు దేహశుద్ధి చేసిన స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు. దుండగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.