మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లిన దుండగులు
ABN , First Publish Date - 2021-10-27T16:21:20+05:30 IST
జిల్లాలోని సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో చెరుకూరి యమున అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల పుస్తెలతాడు గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు.
కామారెడ్డి: జిల్లాలోని సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో చెరుకూరి యమున అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల పుస్తెలతాడు గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు. కుప్రియాల్ గ్రామంలోని కేజిబివి పాఠశాలలో యమున విధులు నిర్వహిస్తోంది. విధులు ముగించుకొని రోడ్డుపై బస్సు కోసం ఎదురుచూస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్పై వెనుక నుంచి వచ్చి పుస్తెలతాడు లాకెళ్లిన్నట్లు బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.