Kamareddy: ప్రమాదవశాత్తు బస్సు కింద పడి వృద్ధుడు మృతి
ABN , First Publish Date - 2022-05-19T15:36:18+05:30 IST
జిల్లాలోని కొత్త బస్టాండ్లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది.
కామారెడ్డి: జిల్లాలోని కొత్త బస్టాండ్లో గురువారం ఉదయం ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన షేక్ లతీఫ్ (69) అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు బస్సు కింద పడి మృతి చెందాడు. ఇద్దరు కుమార్తెలను అత్తగారు ఇల్లు అయిన బోధన్లో దింపేందుకు షేక్ లతీఫ్ సిరిసిల్ల నుంచి కామారెడ్డికి వచ్చాడు. బోధన్ బస్ ఎక్కేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.