Telangana news: జంగంపల్లి రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ

ABN , First Publish Date - 2022-05-12T17:58:25+05:30 IST

జిల్లాలోని బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది.

Telangana news: జంగంపల్లి రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ

కామారెడ్డి: జిల్లాలోని బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఉత్సవాలు ముగిసిన రెండు రోజులకే ఆలయ తలుపులు ధ్వంసం చేసిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని అమ్మవారి అరతులం పుస్తెమట్టెలు, అరతులం బంగారు గొలుసు, లక్షన్నర హుండీ ఆదాయాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇటీవలే విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు, పదర్ల పండగ పూర్తి అయ్యింది. నేడు ఆలయంలో హుండీ లెక్కించాలని గ్రామస్థులు అనుకున్నారు. కాగా ఇంతలోనే ఆలయంలో దొంగలు పడి సొత్తును దోచుకెళ్లారు. ఆలయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని క్లూస్ టీంను రప్పించి విచారణ చేపట్టారు. 


Read more