Kamareddy: తహశీల్దార్ ఆఫీస్‌లో రైతు వీరంగం

ABN , First Publish Date - 2022-06-30T15:42:48+05:30 IST

జిల్లాలోని లింగంపేట్ తహిశీల్దార్ కార్యాలయంలో ఓ రైతు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.

Kamareddy: తహశీల్దార్ ఆఫీస్‌లో రైతు వీరంగం

కామారెడ్డి: జిల్లాలోని లింగంపేట్ తహశీల్దార్ కార్యాలయంలో ఓ రైతు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తహశీల్దార్‌ మారుతిపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడికి ప్రయత్నించాడు. రైతు వీరంగంపై పోలీసులకు తహశీల్దార్  ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అదుపులోకి తిసుకోడానికి వచ్చిన కానిస్టేబుల్‌పై కూడా  రైతు తోట సంగమేశ్వర్ దాడి చేశాడు. షెట్పల్లి సంగారెడ్డిలో తనకున్న 7 గుంటల భూమి వివరాల సవరణన కోసం ఎన్నో సంవత్సరాలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అందుకే విసిగిపోయిన తాను ఇలా ప్రవర్తించాల్సి వచ్చిందని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. 

Updated Date - 2022-06-30T15:42:48+05:30 IST