కామారెడ్డి జిల్లాలో కరోనాతో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-12-05T16:33:00+05:30 IST

కామారెడ్డి జిల్లా: క్యాసంపల్లి గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.

కామారెడ్డి జిల్లాలో కరోనాతో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా: క్యాసంపల్లి గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి అనే వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. 20 రోజుల క్రితం డయాలసిస్‌తో బాధపడుతూ హైదరాబాద్, గాంధీ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స చేస్తుండగా.. అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వైద్యులు కొండల్ రెడ్డికి చికిత్స అందించినా ఫలితం  దక్కలేదు. శనివారం రాత్రి తుది శ్వాస విడిచాడు. ఆయన కరోనాతో మరణించడంతో క్యాసంపల్లి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-12-05T16:33:00+05:30 IST