Kamareddy: జిల్లా కలెక్టరేట్లో కరోనా కలకలం
ABN , First Publish Date - 2022-01-14T16:15:30+05:30 IST
జిల్లా కలెక్టరేట్లో కరోనా కలకలం రేగింది.
కామారెడ్డి: జిల్లా కలెక్టరేట్లో కరోనా కలకలం రేగింది. కలెక్టరేట్ కార్యాలయంలో ఓ జిల్లా స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో కలెక్టరేట్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ కరోనా పరీక్షలు చేసుకోగా నెగిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే లక్షణాలు కలిగి ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.