కమనీయం నారసింహుడి కల్యాణం

ABN , First Publish Date - 2022-07-03T06:01:47+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీలక్ష్మీ నృసింహుడి క్షేత్రంలో శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసి ంహుడి నిత్యాకల్యాణం వేదపండితులు శనివారం కమణీయంగా నిర్వహించారు.

కమనీయం నారసింహుడి కల్యాణం
కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

మఠంపల్లి, జూలై 2: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీలక్ష్మీ నృసింహుడి క్షేత్రంలో శ్రీరాజలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసి ంహుడి నిత్యాకల్యాణం వేదపండితులు శనివారం కమణీయంగా నిర్వహించారు. ప్రతిమాసం మట్టపల్లి లక్ష్మీనరసింహునికి స్వాతీ నక్ష త్ర శుభఘడియల్లో నిర్వహించే కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా నిర్వహిం చారు. అనంతరం ఆలయ సంప్రదాయ ప్రకారం ఆర్జిత కైంకర్యాలు జరిగాయి. కల్యాణ మూర్తులను పరిణయోత్సవ వేదికపైకి వేంచే యించి పుణ్యాహవాచనం గావించారు. మాంగళ్యధారణ, యజ్ఘోపవీత ధారణలు అనంతరం దివ్యమూర్తులకు గరుడోత్సవం జరిగింది. మ ధ్యాహ్నం అమ్మవారికి కుంకుమార్చన, విశేషపర్యాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ చెన్నూరి మట్టపల్లిరావు, విజయ్‌కుమార్‌, ఈవో సిరికొండ నవీన్‌, ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T06:01:47+05:30 IST