కమనీయం... అప్పన్న నిత్య కల్యాణం
ABN , First Publish Date - 2021-12-09T05:06:12+05:30 IST
వరాహలక్ష్మీనృసింహస్వామి ఆర్జిత నిత్యకల్యాణాన్ని బుధవారం కమనీయంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ప్రభాత సేవలు నిర్వహించారు. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కల్యాణమండపంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు.
సింహాచలం, డిసెంబరు 8: వరాహలక్ష్మీనృసింహస్వామి ఆర్జిత నిత్యకల్యాణాన్ని బుధవారం కమనీయంగా నిర్వహించారు. వేకువజామున స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి ప్రభాత సేవలు నిర్వహించారు. ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కల్యాణమండపంలో ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనము, కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్రా బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియలను పూర్తి చేశారు. తొలుత ఇదే వేదికపై స్వామివారికి సహస్రనామార్చన చేశారు. భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.