పార్టీ నేతలతో Kamal చర్చలు
ABN , First Publish Date - 2022-02-02T15:37:24+05:30 IST
మక్కల్నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ పార్టీ నాయకులతో మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల వ్యూహరచన, ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ
- చెన్నైలో 160 మంది అభ్యర్థులు
చెన్నై: మక్కల్నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ పార్టీ నాయకులతో మంగళవారం ఉదయం సమావేశమయ్యారు. కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల వ్యూహరచన, ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మౌర్యా, సెంథిల్ ఆరుముగం, శివఇలంగో తదితరులు పాల్గొన్నారు. అదే సమయంలో చెన్నై కార్పొరేషన్లో పోటీ చేయనున్న 23 అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇప్పటివరకూ కార్పొరేషన్లో పోటీకి మొత్తం 160 మంది అభ్యర్థుల పేర్లను ఆయన వెల్లడించారు.