సోనియాగాంధీని కలిసిన మధ్యప్రదేశ్ నేతలు

ABN , First Publish Date - 2022-04-19T20:03:04+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కీలక నేతలు..

సోనియాగాంధీని కలిసిన మధ్యప్రదేశ్ నేతలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కీలక నేతలు మంగళవారంనాడు కలుసుకున్నారు. సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్, పార్టీ నేతలు దిగ్విజయ్ సింగ్, ముకుల్ వాస్నిక్, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సంసిద్ధతం కావడం, ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో నేతలు చర్చించినట్టు తెలుస్తోంది.


ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికల కోసం తన ప్రెజెంటేషన్‌ను కాంగ్రెస్ పార్టీకి సమర్పించిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ నేతలు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత మూడు రోజులుగా కాంగ్రెస్ అగ్రనేతలతో ప్రశాంత్ కిషోర్‌ సంప్రదింపులు సాగిస్తున్నారు. కాగా, షెడ్యూల్ ప్రకారం 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2023 నవంబర్ లోగా జరగాల్సి ఉన్నాయి.

Updated Date - 2022-04-19T20:03:04+05:30 IST