దక్షిణ కోయంబత్తూరులో కమల్ హాసన్ ఆధిక్యం

ABN , First Publish Date - 2021-05-02T20:40:47+05:30 IST

తమిళనాడు శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం

దక్షిణ కోయంబత్తూరులో కమల్ హాసన్ ఆధిక్యం

కోయంబత్తూరు : తమిళనాడు శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. దక్షిణ కోయంబత్తూరు నియోజకవర్గంలో మక్కల్ నీధి మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరు జిల్లాలోని 10 శాసన సభ నియోజకవర్గాల్లో తొమ్మిదింట్లో అధికార ఏఐఏడీఎంకే ఆధిక్యంలో కనిపిస్తోంది. దక్షిణ కోయంబత్తూరులో కమల్ హాసన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి మయూర జయ కుమార్ కన్నా ముందంజలో ఉన్నారు. ఆయన ఆదివారం ఉదయం జీసీటీ కళాశాల ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు కేంద్రానికి వచ్చారు. 


తొండముత్తూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి, ఏఐఏడీఎంకే అభ్యర్థి ఎస్‌పీ వేలుమణి తన ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి కార్తికేయ శివసేనాపతి కన్నా ముందంజలో ఉన్నారు. 


Updated Date - 2021-05-02T20:40:47+05:30 IST