వేద పండితులకు కామధేను పురస్కారాలు

ABN , First Publish Date - 2021-02-25T03:26:17+05:30 IST

శ్రీలలితా మహేశ్వరి ఆశ్రమంలో బుధవారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన పదిమంది వేద, అర్చక పండితులకు కామధేను పురస్కారాలు అందచేశారు.

వేద పండితులకు కామధేను పురస్కారాలు
శివయ్యస్వామికి పురస్కారం

ఇందుకూరుపేట, ఫిబ్రవరి 24 : శ్రీలలితా మహేశ్వరి ఆశ్రమంలో బుధవారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన పదిమంది వేద, అర్చక పండితులకు కామధేను పురస్కారాలు అందచేశారు. మండలంలో కొత్తూరు ఆశ్రమంలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేవీ రమణాచారి జన్మదినం సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతులు రామాయణం మహేష్‌స్వామి, నిర్వాహకులు మైపాడు రాజా ఈ కార్యక్రమం నిర్వహించి పండితులను సత్కరించారు. శివయ్యస్వామి రంగబాబు, మల్లిఖార్జున అవధాని, జ్యోతిప్రసాదు, శ్రీకాంత్‌, నాగరాజుశాస్త్రి, అళహరి తదితర పండితులను ఘనంగా   సత్కరించారు. ఈ సందర్భంగా మైపాడు రాజా మాట్లాడుతూ ప్రతి ఏడాది రమణాచారి జన్మదినం సందర్భంగా పండితులను సత్కరించే బాటలోనే ఈ ఏడాది కూడా ఆశ్రమంలో నిర్వహించినట్లు తెలిపారు. మహేష్‌స్వామి, ఉచ్చి భువనేశ్వరప్రసాద్‌, ఎస్‌ఐ నరేష్‌, నిర్మల నరసింహారెడ్డి, వి.శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-02-25T03:26:17+05:30 IST