యాదాద్రీశుడికి శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2022-01-28T06:03:07+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం నిత్య కల్యాణోత్సవ పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి.

యాదాద్రీశుడికి శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం
కల్యాణాన్ని నిర్వహిస్తున్న పూజారులు

యాదాద్రి టౌన్‌, జనవరి27: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో గురువారం నిత్య కల్యాణోత్సవ పర్వాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున స్వామి వారిని మేల్కొలిపిన ఆచార్యులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమూర్తులను వేదమంత్ర పఠనాల తో పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చించారు. కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్లను పట్టువస్త్రాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో అలంకరించారు. అనంతరం విశ్వక్సేనుడికి తొలిపూజతో లక్ష్మీనృసింహుల తిరుకల్యాణోత్సవాన్ని సంప్రదాయరీతిలో నిర్వహించారు. ముందుగా సుదర్శన నారసింహ హోమ పూజలు కొనసాగాయి. అనుబంధ రామలింగేశ్వరుడిని కొలిచిన అర్చకులు దర్శన క్యూకాంప్లెక్స్‌లో కొలువుదీరిన చరమూర్తులకు నిత్య పూజలు స్మార్త సంప్రదాయ పద్ధతిలో కొనసాగాయి. కాగా, ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.12,83,648 ఆదాయం సమకూరింది. ఇదిలా ఉండగా ఆలయంలో హుండీల నగదును ఈ నెల 31న నిర్వహించనున్నట్టు ఈవో గీతారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2022-01-28T06:03:07+05:30 IST