పీఎం కేర్స్ ఫండ్కు కల్యాణి గ్రూప్ రూ. 25 కోట్లు
ABN , First Publish Date - 2020-04-01T02:13:09+05:30 IST
కరోనా మహమ్మారిపై వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో కల్యాణి గ్రూప్కు చెందిన ఆటో
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరులో కల్యాణి గ్రూప్కు చెందిన ఆటో కాంపోనెంట్స్ దిగ్గజం భారత్ ఫోర్జ్, గ్రూపునకు చెందిన ఇతర సంస్థలు పీఎం కేర్స్ ఫండ్కు రూ. 25 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. అలాగే, వెంటిలేటర్లు, శ్వాసకోశ పరికరాలు, ఇతర పారిశుద్ధ్య, పరిశుభ్రత పరికరాలు వంటి వాటి అవసరాలు తీర్చేందుకు తన ఆర్అండ్డి సౌకర్యాలను ఉపయోగించుకోవాలని ఈ గ్రూప్ యోచిస్తోంది. విరాళం ప్రకటించిన కల్యాణి గ్రూప్లోని ఇతర కంపెనీల్లో కల్యాణి స్టీల్, సార్లోహా అడ్వాన్స్డ్ మెటీరియల్ ప్రైవేట్ లిమిటెడ్, ఆటోమోటివ్ యాక్సెల్స్ అండ్ హికల్ లిమిటెడ్ వంటివి ఉన్నట్టు కల్యాణి గ్రూప్ తెలిపింది. ఈ సందర్భంగా భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి మాట్లాడుతూ.. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక అధికారులకు అన్ని విధాలుగా సహకరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.