కన్నుల పండువగా వేంకటేశ్వరుడి కల్యాణం
ABN , First Publish Date - 2021-02-27T04:06:52+05:30 IST
మండలంలోని గంగాపూర్ శివారులోని శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి సన్నిదిలో శుక్రవారం గంగాపూర్ జాతర ప్రారంభ సందర్భంగా బాలాజీ వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతిల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.
రెబ్బెన, ఫిబ్రవరి 26: మండలంలోని గంగాపూర్ శివారులోని శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి సన్నిదిలో శుక్రవారం గంగాపూర్ జాతర ప్రారంభ సందర్భంగా బాలాజీ వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతిల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహాలను పల్లకిలో కల్యాణ వేదికపైకి తీసుకు వచ్చారు. అలాగే టీటీడీ నుంచి స్వామి వారికి పట్టువస్త్రాలను తీసుకురావడంతో స్వాగతం పలికి స్వామి వారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్, హరిత దంపతులతో పాటు సర్పంచ్ వినోద, మధునయ్య దంపతుల చేతుల మీదుగా కల్యాణం నిర్వహించారు. కార్యక్ర మంలో ఎంపీపీ సౌందర్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, సింగిల్ విండో చైర్మన్ సంజీవ్కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేష్, టీఆర్ఎస్ నాయకులు పోటు శ్రీధర్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు సోమశేఖర్, ఈవో బాపి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ డీఎస్పీ అచ్చేశ్వర్రావు ఆధ్వర్యంలో రెబ్బెన సీఐ సతీష్, ఆసిఫాబాద్ సీఐ అశోక్లతో పాటు ఎస్సైలు భవానీ సేన్, రమేష్ తదితరులు భద్రత చర్యలు చేపట్టారు. గంగాపూర్ వాసులు అన్నదాన కార్యక్రమం చేపట్టగా డీఎస్పీ అచ్చేశ్వర్రావు ప్రారంభించారు.