కల్యాణలక్ష్మితో పేదలకు భరోసా: ఎమ్మెల్యే సండ్ర

ABN , First Publish Date - 2021-04-13T05:49:10+05:30 IST

పేద ఆడపిల్లల పెండ్లిళ్లకు ప్రభుత్వం భరోసా కల్పిస్తూ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకం నిరుపేదల కన్నీరు తుడుస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

కల్యాణలక్ష్మితో పేదలకు భరోసా: ఎమ్మెల్యే సండ్ర
ఎన్టీఆర్‌ కాలనీలో కల్యాణలక్ష్మీ చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి, ఏప్రిల్‌ 12: పేద ఆడపిల్లల పెండ్లిళ్లకు ప్రభుత్వం భరోసా కల్పిస్తూ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకం నిరుపేదల కన్నీరు తుడుస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం సత్తుపల్లి మునిసిపాలిటీ పరిధిలో రూ.40లక్షల విలువగల చెక్కులను 40మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, రూ.6.97లక్షల చెక్కులు 13మందికి ముఖ్యమంత్రి సహాయనిధి సహాయాన్ని ఆయన ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఆడబిడ్డల పెళ్ళిలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న ఆర్ధిక సహాయంతో పాటు ఎమ్మెల్యే సండ్ర చీరెలను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కూసంపూడి మహేష్‌, కమీషనర్‌ కే.సుజాత, కౌన్సిలర్లు చాంద్‌పాషా, గ్రాండ్‌ మౌలాలీ, మట్టా ప్రసాద్‌, అద్దంకి అనిల్‌, దూదిపాల రాంబాబు, నడ్డి జమలయ్య, తడికమళ్ల ప్రకాశరావు, మదీనాపాషా, రూతు క్రిష్టియానా, సదర్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

వేంసూరు: వేంసూరు మండలంలోని లింగపాలెం, వేంసూరు, మర్లపాడు, లచ్చన్నగూడెం, కందుకూరు తదితర గ్రామాల్లో సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కల్యాణలక్ష్మీ, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా లాక్‌డౌన్‌ సమయంలో సీఎం కేసీఆర్‌ ఈ పథకాల కింద లబ్ధిదారులకు చేయూతనందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సింగపోగు పద్మ, ఎండీ.పైజుద్దీన్‌, మందపాటి వేణుగోపాల్‌రెడ్డి, అక్కేపల్లి సుహాసిని, మందపాటి సునీత పాల్గొన్నారు.


Updated Date - 2021-04-13T05:49:10+05:30 IST