రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్‌ ధ్వంసం చేస్తున్నాడు: కాల్వ

ABN , First Publish Date - 2020-05-27T01:34:41+05:30 IST

రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్‌ ధ్వంసం చేస్తున్నాడని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు.

రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్‌ ధ్వంసం చేస్తున్నాడు: కాల్వ

అమరావతి: రాజ్యాంగ వ్యవస్థల్ని జగన్‌ ధ్వంసం చేస్తున్నాడని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. దళిత మేధావిని ఈ ప్రభుత్వం పిచ్చివాడిని చేసిందన్నారు. మాస్క్‌లు అడిగితే డా.సుధాకర్‌ను సస్పెండ్‌ చేశారని చెప్పారు. అలాగే రమేష్‌కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. నియంతృత్వ మనస్తత్వంతో జగన్‌ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ అనేక తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పైశాచికత్వం రాజ్యమేలుతోందన్నారు. 

 

Updated Date - 2020-05-27T01:34:41+05:30 IST