కల్తీ కల్లు ఘటన కలచివేసింది: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-02-03T01:52:33+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ఆయన తెలిపారు. ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ మద్యం విధానంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.