కల్పతరు డే సందర్భంగా ఆర్‌కే మఠ్ పుస్తకాలపై 40% డిస్కౌంట్

ABN , First Publish Date - 2022-01-01T01:28:02+05:30 IST

హైదరాబాద్: కొత్త సంవత్సరం 2022 తొలి రోజు జనవరి ఒకటిన రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది.

కల్పతరు డే సందర్భంగా ఆర్‌కే మఠ్ పుస్తకాలపై 40% డిస్కౌంట్

హైదరాబాద్: కొత్త సంవత్సరం 2022 తొలి రోజు జనవరి ఒకటిన రామకృష్ణ మఠంలో పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్ లభించనుంది.  వివేకానంద సాహిత్యంతో పాటు అనేక పుస్తకాలపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.


ప్రతియేటా జనవరి ఒకటిన రామకృష్ణ మఠంలో కల్పతరు పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం ఏడున్నరకు విశేష పూజ, భజనలుంటాయి. పదింబావుకు హోమం నిర్వహిస్తారు. 11 గంటలకు ప్రసంగం ఉంటుంది. 11:50కి విశేష హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోజన ప్రసాదం ఉంటుంది. సాయంత్రం 6:45కు ఆరాత్రికం, 7:15కు ప్రత్యేక భజనలుంటాయి. 

Updated Date - 2022-01-01T01:28:02+05:30 IST