‘లుధియానా’ ఘటనలో ఖలిస్థాన్ హస్తం: డీజీపీ
ABN , First Publish Date - 2021-12-26T07:15:27+05:30 IST
లుధియానా జిల్లా కోర్టు కాంపెక్స్లో బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన గగన్దీప్ సింగ్కు ఖలిస్థాన్, ..
చండీగఢ్, డిసెంబరు 25 : లుధియానా జిల్లా కోర్టు కాంపెక్స్లో బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన గగన్దీప్ సింగ్కు ఖలిస్థాన్, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటన వెనక పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థల పాత్ర ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. పంజాబ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ సిద్దార్థ చటోపాధ్యాయ శనివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.