ముగిసిన కాళేశ్వరం జోన్స్థాయి గురుకుల క్రీడలు
ABN , First Publish Date - 2022-09-28T05:03:44+05:30 IST
స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల అవరణలో మూడు రోజుల పాటు నిర్వహించిన కాళేశ్వరం జోన్స్థాయి క్రీడోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.
మంథని, సెప్టెంబర్ 27: స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల అవరణలో మూడు రోజుల పాటు నిర్వహించిన కాళేశ్వరం జోన్స్థాయి క్రీడోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. వివిధ క్రీడా విభాగాల్లో 21 అంశాల్లో జోన్ పరి ధిలోని విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. 5 జిల్లాల్లోని 11 గురకులాల నుంచి 132 జట్లు క్రీడల్లో పాల్గొన్నాయి. కబడ్డీలో అండర్-14లో జైపూర్, అండర్-17, 19లో మంథని, ఖోఖోలో అండర్-14 జాకారం, అండర్-17, 19లో మంథని, చెస్లో అండర్-14, 19లో ఆసిఫాబాద్, అండర్-17లో మంథని, క్యారమ్లో అండర్-14లో పెద్దపల్లి, 17లో ఆసీఫాబాద్, 19లో జాకారం, టెన్నికైట్లో అండర్-14, 17, 19లో మంథని, ఫుట్బాల్లో అండర్-17, 19 జైపూర్, హ్యాండ్బాల్లో అండర్-17 జైపూర్, 14లో మంథని, బాల్బ్యాడ్మింటన్లో అండర్-1లో జాకారం, 19లో ఏటూరునాగారం, వాలీబాల్లో అండర్-17 బెల్లంపల్లి, 19లో ఏటూరునాగారం విజేతలుగా నిలిచారు. విజేతలకు మంథని ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత-శంకర్ లాల్, తహశీల్దార్ బండి ప్రకాష్, ఎంపీడీవో రమేష్, పాఠశాల ప్రన్సిపాల్ వెంకట్రామ్రెడ్డి, ఏఆర్సీవో సూర్యప్రకాష్ బహుమతులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో పీఈటీ లు, ఉపాధ్యాయు, విద్యార్థులు పాల్గొన్నారు.