TS News: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపం లేదు: నిరంజన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-07-24T18:41:02+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleshwaram Project)లో లోపం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) తెలిపారు.

TS News: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లోపం లేదు: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ (Kaleshwaram Project)లో లోపం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy) తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరి వరదలు (Godavari floods) మానవ తప్పిదం కాదని, ప్రకృతి విపత్తు అని చెప్పారు. నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్ట్‌ కట్టడానికే 30 ఏళ్ల పట్టిందని విమర్శించారు. తాము మూడేళ్లలోనే ప్రాజెక్ట్‌లు పూర్తి చేశామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్‌పై కొందరు సైంధవ పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. వరదల వల్ల పంటనష్టం జరగలేదని, ఇది ఇష్యూ కాదని నిరంజన్‌రెడ్డి తోచిపుచ్చారు.

Updated Date - 2022-07-24T18:41:02+05:30 IST