రాయదుర్గంలో అక్రమాలు మితిమీరాయి: కాల్వ
ABN , First Publish Date - 2021-01-21T23:23:21+05:30 IST
రాయదుర్గంలో అక్రమాలు మితిమీరాయి: కాల్వ
అమరావతి: కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి రాయదుర్గంలో అక్రమాలు మితిమీరాయని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. కాపు రామచంద్రారెడ్డి అరాచక శక్తిగా మారాడన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. కాపు రామచంద్రారెడ్డిపై సీఎం చర్యలు తీసుకోవాలని సూచించారు.