జగన్ ప్రభుత్వంపై కళా వెంకట్రావు ఫైర్
ABN , First Publish Date - 2022-05-19T20:05:54+05:30 IST
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు.
విజయనగరం : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి దగ్గర బూతులు మాట్లాడే వారు, ఇసుక దందాలు, పేకాట ఆడించేవారే మంత్రులుగా ఉన్నారన్నారు. నలుగురు మంత్రులతో బస్సు యాత్రలు చేస్తే ప్రజలకు సామాజిక న్యాయం జరగదని కళా వెంకట్రావు పేర్కొన్నారు.