పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి: డీఎస్పీ

ABN , First Publish Date - 2022-08-10T05:26:15+05:30 IST

గొల్లప్రోలు, ఆగస్టు 9: పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని, అన్ని రికార్డులు అప్‌డేట్‌గా ఉంచాలని కాకినాడ డీఎస్పీ భీమారావు ఆదేశించారు. గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌లో పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు, సర్కిల్‌లోని ఎస్‌ఐలతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈనెల 13వ తేదిన జాతీయ లోక్‌అదాలత్‌ జరుగుతున్నందున తమ తమ పరిధిలోని కేసుల్లో ఉన్న కక్షిదారులకు ఈ

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి: డీఎస్పీ

గొల్లప్రోలు, ఆగస్టు 9: పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని, అన్ని రికార్డులు అప్‌డేట్‌గా ఉంచాలని కాకినాడ డీఎస్పీ భీమారావు ఆదేశించారు. గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌లో పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు, సర్కిల్‌లోని ఎస్‌ఐలతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈనెల 13వ తేదిన జాతీయ లోక్‌అదాలత్‌ జరుగుతున్నందున తమ తమ పరిధిలోని కేసుల్లో ఉన్న కక్షిదారులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలన్నారు. రాజీపడదగిన కేసులను గుర్తించి వారికి లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు శంకరరావు, రామలింగేశ్వరరావు, అబ్ధుల్‌ నబీ, జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:26:15+05:30 IST