సుబ్రహ్మణ్యం హత్య కేసు.. వివరాలు సరిగా లేకపోవడంతో జడ్జి ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-24T04:17:58+05:30 IST

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అయితే కేసు వివరాలు సరిగా ..

సుబ్రహ్మణ్యం హత్య కేసు.. వివరాలు సరిగా లేకపోవడంతో జడ్జి ఆగ్రహం

కాకినాడ: డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అయితే కేసు వివరాలు సరిగా లేకపోవడంతో పోలీసులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసు వివరాలు సరి చేసేందుకు సర్పవరం పీఎస్‌కు పోలీసులు వెళ్లారు. నిందితుడు అనంతబాబు ఇంకా జడ్జి ఇంటి వద్దే ఉన్నారు. ఈ నెల 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని  ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశారు. కేసు ప్రాథమిక విచారణలో సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు పోలీసుల వద్ద అంగీకరించారు. దీంతో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల ప్రక్రియ పూర్తి చేశారు. 

Updated Date - 2022-05-24T04:17:58+05:30 IST