టీచర్‌ ఫిర్యాదుపై కాకినాడ ఆర్జేడీ విచారణ

ABN , First Publish Date - 2020-07-10T11:18:51+05:30 IST

ఏలూరులోని ఓ ఎయిడెడ్‌ విద్యా సంస్థ, ఆ స్కూల్‌లో పని చేస్తున్న టీచర్‌కు నెలకొన్న వివాదం ..

టీచర్‌ ఫిర్యాదుపై కాకినాడ ఆర్జేడీ విచారణ

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 9: ఏలూరులోని ఓ ఎయిడెడ్‌ విద్యా సంస్థ, ఆ స్కూల్‌లో పని చేస్తున్న టీచర్‌కు నెలకొన్న వివాదం నేపథ్యంలో నమోదైన ఫిర్యాదును విచారించేందుకు పాఠశాల విద్య ప్రాంతీయ సం యుక్త సంచాలకులు (కాకినాడ ఆర్జేడీ) ఆర్‌ నరసింహారావు గురువారం  డీఈవో కార్యాలయానికి విచ్చేశారు. స్కూలు యాజమాన్యంపై వచ్చిన ఆరో పణలకు సంబంధించి సంబంధిత టీచర్‌ నుంచి వివరణ తీసుకున్నారు. స్కూలు యాజ మాన్యం, హెచ్‌ఎం తనను వేధిస్తున్నారని, జీతం చెల్లిం చడం లేదని టీచర్‌ ఆరోపించారు. దీనిపై ఆర్జేడీ మాట్లాడుతూ విచారణ నివేదికను విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తామని వివరించారు. 

Updated Date - 2020-07-10T11:18:51+05:30 IST