దిశ పోలీస్‌స్టేషన్‌ నూతన భవన నిర్మాణం

ABN , First Publish Date - 2022-08-14T05:57:30+05:30 IST

కాకినాడ క్రైం, ఆగస్టు 13: దిశ చట్టం స్ఫూర్తి, ఆశయాలకు అనుగుణంగా దిశ పోలీస్‌స్టేషన్‌ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. మూడో పట్టణ పోలీ్‌సస్టేషన్‌ వెనుకాల ఉన్న ట్రాఫిక్‌ పార్కు ప్రాంగణంలో రూ.2.73కోట్లతో నిర్మించనున్న జీప్లస్‌ వన్‌ అత్యాధునిక పోలీ్‌సస్టేషన్‌ నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే మహిళలు,

దిశ పోలీస్‌స్టేషన్‌ నూతన భవన నిర్మాణం
భూమి పూజ నిర్వహిస్తున్న ఎస్పీ

కాకినాడ క్రైం, ఆగస్టు 13: దిశ చట్టం స్ఫూర్తి, ఆశయాలకు అనుగుణంగా దిశ పోలీస్‌స్టేషన్‌ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్టు ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. మూడో పట్టణ పోలీ్‌సస్టేషన్‌ వెనుకాల ఉన్న ట్రాఫిక్‌ పార్కు ప్రాంగణంలో రూ.2.73కోట్లతో నిర్మించనున్న జీప్లస్‌ వన్‌ అత్యాధునిక పోలీ్‌సస్టేషన్‌ నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. పోలీ్‌సస్టేషన్‌కు వచ్చే మహిళలు, బాధితులు, ఫిర్యాదుదారుల కోసం ప్రత్యేక కౌన్సెలింగ్‌ రూమ్‌, వెయిటింగ్‌ హాల్‌, ఫీడింగ్‌ రూమ్‌, టాయిలెట్లు తదితర అన్ని మౌలిక వసతులతో దిశ పోలీ్‌సస్టేషన్‌ భవనం నిర్మించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ పి.శ్రీనివాస్‌, దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, ఎస్‌డీపీవో భీమారావు, ఎస్‌బీ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ట్రాఫిక్‌ డీఎస్సీ పడాల మురళీకృష్ణారెడ్డి, ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ బి.అప్పారావు, సీఐ బి.రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:57:30+05:30 IST