ఉప్పాడలో కలుషి తాగునీటి సరఫరాపై వర్మ ఫైర్

ABN , First Publish Date - 2022-04-18T16:49:46+05:30 IST

ఉప్పాడలో బ్యాక్టీరియా కలిసిన కలుషిత తాగునీటి సరఫరాపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉప్పాడలో కలుషి తాగునీటి సరఫరాపై వర్మ ఫైర్

కాకినాడ: ఉప్పాడలో బ్యాక్టీరియా కలిసిన కలుషిత తాగునీటి సరఫరాపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సురక్షిత నీళ్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదా అని మండిపడ్డారు. బ్యాక్టీరియా ఉన్న నీటిని బాటిళ్లలో నింపి కలెక్టరేట్‌కు చూపించిన వర్మ... ఈ నీటిని ఎవరైనా తాగుతారా అంటూ ప్రశ్నించారు. నీటిని ల్యాబ్‌కు పంపి పరీక్ష చేయాలని, తక్షణం ఉప్పాడ తీర గ్రామానికి మంచి నీళ్ళు ఇవ్వాలని వర్మ డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-04-18T16:49:46+05:30 IST