Ap News: వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇంటికి నిప్పు

ABN , First Publish Date - 2022-05-25T01:45:24+05:30 IST

అమలాపురం (Amalapuram)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా (Konaseema District)ను కొనసాగించాలని ...

Ap News: వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇంటికి నిప్పు

Kakinada: అమలాపురం (Amalapuram)లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా (Konaseema District)ను కొనసాగించాలని స్థానిక జేఏసీ నేతలు, యువకులు ఆందోళనను కొనసాగిస్తున్నారు. దీంతో పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. 


మరోవైపు ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ (Ycp Mla Ponnada Satish) ఇంటిని ఆందోళనకారులు దగ్ధం చేశారు. హౌసింగ్‌బోర్డు కాలనీలోని సతీష్‌ ఇంటికి నిప్పుంటించారు. ఈ ఘటనతో అధికార పార్టీ నేతల ఇళ్లను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. అమలాపురంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. అటు అమలాపురం చేరుకున్న ఏలూరు రేంజ్‌ డీఐజీ పాల్‌రాజ్‌.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 


అయితే తన ఇంటికి నిప్పు పెట్టడంపై ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు ఉద్దేశ్వపూర్వకంగానే చేశారని ఆరోపించారు. విధ్వంసం ఘటనపై విచారణ జరిపి నిందితులను బయటకు లాగుతామని హెచ్చరించారు. విధ్వంసం వెనుక పెద్ద కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాలపై రాజకీయ పార్టీలు కూడా అభ్యంతరం చెప్పలేదన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా  నిర్ణయం తీసుకోలేదని పొన్నాడ సతీశ్ తెలిపారు. 


Updated Date - 2022-05-25T01:45:24+05:30 IST