నేడు బియ్యాల జనార్దన్రావు 19వ స్మారకోపన్యాసం
ABN , First Publish Date - 2021-02-27T05:39:28+05:30 IST
నేడు బియ్యాల జనార్దన్రావు 19వ స్మారకోపన్యాసం
కేయూ క్యాంపస్, ఫిబ్రవరి 26: కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం ప్రొఫెసర్, తెలంగాణవాది ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్రావు 19వ స్మారకోపన్యాసం ఆన్లైన్లో జూమ్ యాప్ ద్వారా నిర్వహించనున్నట్లు బియ్యాల జనార్దన్రావు ఫౌండేషన్ సెక్రెటరీ ప్రొఫెసర్ ఇ.రేవతి ఒక ప్రకటనలో తెలిపారు. ‘ల్యాండ్ అండ్ ఫారెస్ట్ రైట్స్ ఆఫ్ ట్రైబల్స్ ’అనే అంశంపై జరిగే సదస్సులో ప్రముఖ న్యాయవాది డాక్టర్ పల్లా త్రినాథ్రావు కీలక ఉపన్యాసం చేస్తారని తెలిపారు. సదస్సు అధ్యక్షులుగా ప్రొఫెసర్ మురళీమనోహర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు జరిగే ఆన్లైన్ సదస్సులో ఆసక్తి గలవారు జూమ్ ఐడీ 829 1335 4702, పాస్వర్డ్ 123456 ద్వారా పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని ప్రొఫెసర్ రేవతి కోరారు.