-
-
Home » Andhra Pradesh » Kakani Govardhan Reddy-MRGS-AndhraPradesh
-
16న YSR Rythu Bharosa నిధుల విడుదల: కాకాని
ABN , First Publish Date - 2022-05-06T21:49:42+05:30 IST
ఖరీప్ సీజన్లో ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్షించారని, మే 16 న వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల విడుదల చేస్తామని వ్యవసాయశాఖ
అమరావతి: ఖరీప్ సీజన్లో ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్షించారని, మే 16 న వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల విడుదల చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్రెడ్డి తెలిపారు. జూన్లో 3 వేల ట్రాక్టర్లతో సహా 4014 వ్యవసాయ పరికరాలు పంపిణీకి సీఎం ఆదేశించారని తెలిపారు. జూన్ 15లోపు పంట నష్ట పరిహారం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఖరీఫ్లో విత్తనాలు, ఎరువుల పంపిణీకి, రైతు కోరిన కంపెనీతో డ్రిప్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని కాకాని గోవర్దన్రెడ్డి తెలిపారు.