వైసీపీ అద్దంకి పట్టణ అధ్యక్షుడిగా ‘కాకాని’
ABN , First Publish Date - 2021-01-16T05:22:26+05:30 IST
వైసీపీ అద్దంకి పట్టణ అధ్యక్షుడిగా కాకాని రాధాకృష్ణమూర్తిని నియమి స్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య శుక్ర వారం ప్రకటించారు.
అద్దంకి, జనవరి 15: వైసీపీ అద్దంకి పట్టణ అధ్యక్షుడిగా కాకాని రాధాకృష్ణమూర్తిని నియమి స్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, అద్దంకి నియోజకవర్గ ఇన్చార్జి బాచిన కృష్ణచైతన్య శుక్ర వారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కోట శ్రీనివాసకుమార్, గూడా శ్రీని వాసరెడ్డి, వేజెండ్ల నాగరాజు, పరిమి ప్రసాద్, నూతలపాటి శ్రీను, విప్పర్ల ప్రసాద్ తదితరులు రాధాకృష్ణమూర్తిని కలిసి అభినందించారు. కాగా, అద్దంకి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్గా వంపుగుడి శ్రీనివాస్ను నియమించేందుకు ప్రతిపాదనలు పంపుతున్నట్లు కృష్ణచైతన్య తెలిపారు.