కదిరిలో YCP MLA అనుచరుల దౌర్జన్యం
ABN , First Publish Date - 2022-07-04T23:00:16+05:30 IST
ఏపీలో అధికార పార్టీ నేతలు వారి అనుచరులు పెట్రేగిపోతున్నారు. కదిరి (Kadiri)లో వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి (YCP MLA Sidda Reddy) అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
కదిరి: ఏపీలో అధికార పార్టీ నేతలు వారి అనుచరులు పెట్రేగిపోతున్నారు. కదిరి (Kadiri)లో వైసీపీ ఎమ్మెల్యే సిద్దారెడ్డి (YCP MLA Sidda Reddy) అనుచరుల దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ భూమిలో ఎమ్మెల్యే అనుచరుడు శివారెడ్డి అక్రమ నిర్మాణం చేపట్టాడు. అడపాలవీధిలో 84 సెంట్ల ప్రభుత్వ భూమిపై ఎమ్మెల్యే అనుచరుల కన్ను పడింది. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే గోడలు నిర్మాణించారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు వెళ్లిన.. రెవెన్యూ అధికారులపై సిద్దారెడ్డి అనుచరుల దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే (MLA) అనుచరుల దాడితో అధికారులు వెనుతిరిగారు.