సీఎం ఇలాకాలో వైసీపీ నేతలకు వరుస నిరసన సెగలు
ABN , First Publish Date - 2021-11-30T19:34:32+05:30 IST
సీఎం జగన్ సొంత ఇలాకాలో వైసీపీ నాయకులకు వరుస నిరసన సెగలు తగులుతున్నాయి.
కడప: సీఎం జగన్ సొంత ఇలాకాలో వైసీపీ నాయకులకు వరుస నిరసన సెగలు తగులుతున్నాయి. రాయచోటిలో ప్రభుత్వ విప్ శ్రీకాంత్రెడ్డిని వరద బాధితులు నిలదీశారు. గరుగుపల్లెలో ఇళ్లు దెబ్బతిన్నవారికి పరిహారం చెక్కులు ఇచ్చేందుకు శ్రీకాంత్రెడ్డి వచ్చారు. ఈ క్రమంలో అర్హులను పక్కనపెట్టి అనర్హులకు పరిహారం ఇస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద బాధితులందరికీ న్యాయం చేస్తామని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నిన్న పులపత్తూరు, మందపల్లెలలో సజ్జలను వరద బాధితులు నిలదీసిన విషయం తెలిసిందే.