కడప: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల దుర్మరణం
ABN , First Publish Date - 2021-04-15T01:57:05+05:30 IST
జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గరు యువకులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు
కడప: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గరు యువకులు ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ముద్దనూరు మండలంలోని కొత్తపల్లెలో బైక్ను బొలేరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులను రవితేజ, చంద్ర శేఖర్రెడ్డి, శివశంకర్ లుగా గుర్తించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.