భూ కబ్జాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు: టీడీపీ

ABN , First Publish Date - 2021-09-14T23:55:30+05:30 IST

జిల్లాలో వైసీపీ నాయకుల భూ కబ్జాలకు పోలీసులు వత్తాసు

భూ కబ్జాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు: టీడీపీ

కడప: జిల్లాలో వైసీపీ నాయకుల భూ కబ్జాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని టీడీపీ నేతలు లింగారెడ్డి, హరిప్రసాద్ ఆరోపించారు. వైసీపీ నాయకుల అక్రమాలకు అడ్డువస్తున్న టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. కడప 50వ డివిజన్ టీడీపీ నాయకుడు వెంకట సుబ్బారెడ్డిని పోలీసులు చితకబాదారని వారు ఆరోపించారు. సంబంధం లేని కేసుల్లో నేరం ఒప్పుకోవాలని ఆయనను తీవ్రంగా కొట్టారని వారు పేర్కొన్నారు. పోలీసుల తీరుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని టీడీపీ నేతలు తెలిపారు. 




ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారు

నేరం అంగీకరించక పోతే ఎన్‌కౌంటర్ చేస్తామని తనను పోలీసులు బెదిరించారని బాధితుడు వెంకట సుబ్బారెడ్డి అన్నారు. 8న హోటల్లో భోజనం చేస్తుంటే 10 మంది పోలీసులు డీఎస్పీ కార్యాలయానికి తనను తీసుకెళ్లి కొట్టారని ఆయన ఆరోపించారు. వివిధ కేసుల్లో నేరం ఒప్పుకోవాలని తతను కొట్టారన్నారు. సీకే దిన్నే పోలీసు స్టేషన్ తీసుకెళ్ళి మరోసారి కొట్టారని ఆయన తెలిపారు. నేరం అంగీకరించక పోతే తనను ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారని ఆయన పేర్కొన్నారు. జిల్లా టీడీపీ నాయకుల చొరవతో తాను బయటపడ్డానని ఆయన తెలిపారు. 

Updated Date - 2021-09-14T23:55:30+05:30 IST