కడప వన్ టౌన్ పీఎస్ దగ్గర దారుణం!
ABN , First Publish Date - 2020-05-31T16:30:38+05:30 IST
కడప నగరంలో దారుణం జరిగింది. వన్ టౌన్ పోలీస్స్టేషన్కు
కడప : కడప నగరంలో దారుణం జరిగింది. వన్ టౌన్ పోలీస్స్టేషన్కు కూత వేటు దూరంలో ఓ వ్యక్తిని యువకులు గొంతు కోసి దారుణానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకెళితే.. బాలాజీ, శాలు, ఖాదర్ భాషా ఈ ముగ్గురు చిన్ననాటి స్నేహితులు. అయితే మనస్పర్థలు రావడంతో బాలాజీ, శాలులపై ఖాదర్ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న ఖాదర్.. నిద్రిస్తున్న బాలాజీ, శాలులను చంపాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో మొదట బాలాజీ గొంతు కోయడానికి రాగా శాలు.. ఖాదర్ను అడ్డుకున్నాడు. దీంతో శాలుపై కూడా దాడి చేయాలని చూశాడు.
వాళ్లిద్దరూ అప్రమత్తమవ్వడంతో ఖాదర్ పరుగులు తీశాడు. ఆ ఇద్దరు వెంబడించటంతో నగరంలోని వన్ టౌన్ స్టేషన్ ఎదురుగా ఖాదర్ కిందపడిపోయాడు. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో శాలు.. ఖాదర్ గొంతు కోశాడు. విషయం గమనించిన స్టేషన్ సిబ్బంది ఆ ఇద్దర్ని అడ్డుకుని.. గాయపడిన ఖాదర్ను రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా.. ఖాదర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్న వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.