రైతులకు సంకెళ్లు వేయడం దారుణం

ABN , First Publish Date - 2020-10-31T07:29:14+05:30 IST

దేశానికి వెన్నముక రైతన్న అంటూనే వారికి సంకెళ్లు వేసి, జైలుకు పంపడం దారుణమని టీడీపీ కడప పార్లమెంట్‌ మహిళా ప్రధాన కార్యదర్శి కోటా శ్రీదేవి ధ్వజమెత్తా రు.

రైతులకు సంకెళ్లు వేయడం దారుణం

 నిరసన ప్రదర్శనలో టీడీపీ నాయకులు


ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 30 : దేశానికి వెన్నముక రైతన్న అంటూనే వారికి సంకెళ్లు వేసి, జైలుకు పంపడం దారుణమని టీడీపీ కడప పార్లమెంట్‌ మహిళా ప్రధాన కార్యదర్శి కోటా శ్రీదేవి ధ్వజమెత్తా రు.  అమరావతి రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ స్థానిక గాంధీరోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సాయంత్రం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమరావతి రైతులు రాజధాని నిర్మా ణం కోసం వారి భూములను త్యాగం చేశారని అలాంటి వారిని సన్మానించాల్సింది పోయి, అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులుపెట్టి సంకెళ్లు వేసి జైలుకు పంపడం క్షమించరాని నేరమన్నారు. దీనిని రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. అమరావతి రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని లేనిపక్షంలో రైతుల పక్షాన టీడీపీ ఆందోళనలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఏసుదాసు, శ్రీనివాసులరెడ్డి, సీబీఎన్‌ ఆర్మీ ఇన్‌చార్జి వెంకటసుబ్బయ్య, నందమూరి యువసేవాసమితి అధ్యక్షుడు సుదర్శన్‌, తెలుగు యువత నాయకులు యశ్వంత్‌, షరీఫ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-31T07:29:14+05:30 IST