మనస్థాపంతో రైతు ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-10-30T10:22:56+05:30 IST
మబ్బుచింత లపల్లె రైతు జల్లా రామిరెడ్డి (69) మన స్థాపంతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలి పారు.
వేముల, అక్టోబరు 29: మబ్బుచింత లపల్లె రైతు జల్లా రామిరెడ్డి (69) మన స్థాపంతో ఉరి వేసుకుని మృతి చెందినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలి పారు. ఎస్ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జల్లా రామిరెడ్డికి కెకె కొ ట్టాలలో నాలుగెకరాల భూమి ఉండే ది. కాగా 2010లో రిజర్వాయర్ నిర్మాణం కోసం మేటాస్ కంపెనీ రా మిరెడ్డి భూమిని స్వాధీనం చేసుకుం దన్నారు. అయితే ఇంత వరకు దాని కి సంబంధించిన పరిహారం సుమా రు రూ.25లక్షలు కంపెనీ చెల్లించలేదన్నారు. భూమిని స్వాధీనం చేసుకోవ డంతో రామిరెడ్డి వ్యవసాయం చేయలేకపోయాడు. దీంతో కుటుంబ పరిస్థితులు దిగజారి పోతుండగా జీవనం కోసం కొంతమేర అప్పు చేశాడు. కంపెనీ నుంచి రావాల్సిన డబ్బు రాకపోవడం ఒకవైపు, అప్పులు ఇచ్చిన వా రి ఒత్తిడి ఎక్కువ అవడంతో గురువారం తెల్లవారుజామున చెట్టుకు ఉరివే సుకుని మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు.