స్కూటర్ను ఆర్టీసీ బస్సు ఢీకొని..
ABN , First Publish Date - 2020-10-27T08:21:42+05:30 IST
స్కూటర్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు ఇరువురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన సోమవారం మైదుకూరు మండలంలోని వనిపెంట వద్ద చోటుచేసుకుంది.
భార్యాభర్తల దుర్మరణం
మైదుకూరు, అక్టోబరు 26 : స్కూటర్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలు ఇరువురు దుర్మరణం చెందారు. ఈ సంఘటన సోమవారం మైదుకూరు మండలంలోని వనిపెంట వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మండలంలోని ఉత్సలవరానికి చెందిన కత్తి చిన్నగుర్రప్ప (46), ఆయన భార్య తిరుపతమ్మ (40) బైక్పై వనిపెంట నుంచి స్వగ్రామం వెళుతుండగా మైదుకూరు నుంచి గిద్దలూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో తిరుపతమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. గుర్రప్పను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.